Thursday, May 9, 2024
- Advertisement -

నాగర్జున కన్నీళ్ళ పర్యంతం అయ్యాడట?

- Advertisement -

నాగచైతన్య హీరోగా మంజిమా మోహన్ హీరోయిన్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో హీరోగా శింబు నటిస్తున్నాడు. రెండు భాషల్లో మంజిమా మెహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కింగ్ నాగర్జున ని నాగచైతన్య ఏడిపించడం ఏంటీ అనుకుంటున్నారా?? అవును ఈ విషయాన్ని స్వంయంగా నాగర్జునే చెప్పాడు. సాహసం శ్వాసగా సాగిపో సినిమా లోని పాటలు విని నాగర్జున అప్రయత్నంగానే ఏడిచాడట. ఒక నెల రోజుల క్రితం నాగచైతన్య వచ్చి నాగార్జున కు సాహసం శ్వాసగా సాగిపో పాటల సీడీ ఇచ్చాడట.

ఆ సీడీ తీసుకొని మ్యూజిక్ రూమ్ లోకి వెళ్లి పాటలు వింటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడట. అదే టైం లో అమల గదిలోకి వచ్చి నాగార్జున ని చూసి షాక్ అయి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ అడిగిందని… తనని అంతగా ఈ పాటలు కదిలించాయని చెప్పాడు నాగార్జున. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -