తెలుగు యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన షోలు, సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, సమాజంలో జరిగే వాటిపై కూడా స్పందిస్తుంటుంది. తాజాగా జరిగిన జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవానులపై జరిగిన తీవ్రవాదులు దాడి గురించి కూడా ట్విట్ చేసింది అనసూయ. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ కూడా అలాంటి వారిని అస్సలు క్షమించకూడదని ట్విట్ చేసింది.
ఇక్కడ వరకు బాగానే ఉంది కాని తరువాతే మొదలైంది అసలు సమస్య. ఈ ట్విట్తో పాటు రెగ్యులర్గానే తన ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ హాట్ యాంకర్. దీంతో కొంతమంది నెటిజన్లు అనసూయ తీరుపై మండిపడుతున్నారు. ఒకవైపు పుల్వామా దాడి విషయంలో అందరూ బాధపడుతుంటే నువ్వు ఇలా రెడీ అయ్యి ఫోటోలు పోస్ట్ చేస్తావా అంటూ విమర్శలు చేశారు. ఇలా కామెంట్ చేసినవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది అనసూయ.
జవానులపై తీవ్రవాదులు దాడి చేసిన తరువాత నువ్వు స్నానం చేయకుండా ఉన్నావా..?, అన్నం తినకుండా ఉన్నావా.. అంటూ ఎదురు ప్రశ్నించింది. అనసూయ ఇచ్చిన కౌంటర్కు నెటిజన్లు దెబ్బకు సైలెంట్ అయ్యారు. నా డ్రస్కు ఆ ఇన్సిడెంట్కు సంబంధం ఏంటి? ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా కర్తవ్యం అంటూ సినిమా డైలాగులు కొట్టింది అనసూయ. మీ పని మీరు చేసుకోండి, అదేవిధాంగా నా పనిని నన్న చేసుకోనివ్వండి అంటూ ట్విట్ చేసింది అనసూయ.
- Advertisement -
దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -