Sunday, April 28, 2024
- Advertisement -

కమలిని ముఖర్జీ ఇప్పుడెలా ఉందంటే ?

- Advertisement -

2004లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన హీరోయిన్ కమలిని ముఖర్జీ. తరువాత సినిమా కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ సినిమాలోను నటించింది. తర్వాత ‘గమ్యం’, ‘జల్సా’, ‘గోపి గోపికా గోదావరి’, ‘గోవిందుడు అందరివాడు’ సినిమాల్లో నటించి అలరించింది. ‘హ్యాపీడేస్’లోనూ గెస్ట్ రోల్ చేసింది. ‘గోవిందుడు అందరివాడు’ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.

ఇదిలా ఉండగా.. చాలా కాలం తర్వాత డల్లాస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కమలిని కెమెరాకు చిక్కింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో నాజూగ్గా కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఆకర్షించే విధంగానే ఉండేది. ఇప్పుడు చాలా లావుగా తయారయ్యింది. అసలు ఈమె హీరోయిన్ కమలిని ముఖర్జీనేనా…? అని షాకయ్యేలా ఉందామె. ఎంతో అందంగా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ అని ఆశ్చర్యపోతూ నెటిజట్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం కమలిని ముఖర్జీ అమెరికాలో సెటిల్ అయింది. సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బాగనే సంపాదిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తాలు

బాలయ్య అభిమానుల్లో పూనకాలు లోడింగ్…

మెగాస్టార్ పూరీ కాంబినేషన్ ఫిక్స్..!

బాలయ్య షో లో పవన్ క్లారిటీ.. ఇస్తారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -