Sunday, April 28, 2024
- Advertisement -

సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్.. హీరో ఎవరో మరి !

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు తెలుగులో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కథలోనూ, కథనంలోనూ కొత్తదనం చూపిస్తూ, విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. ఇక సుకుమార్ ధర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది వచ్చిన ” పుష్ప ” పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఈ లెక్కల మాస్టారు పేరు నార్త్ లో సైతం మారుమ్రోగింది. దాంతో సుక్కు తో మూవీ చేసేందుకు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న కాశ్మీర్ ఫైల్స్ మూవీ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సుకుమార్ తో ఓ మూవీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఆ సంస్థ నిర్మాతలు సుకుమార్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇండియన్ సినిమా ముఖ చిత్రం మారబోతుందంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీంతో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో సుకుమార్ పుష్ప తర్వాతి మూవీ చేయబోతున్నాడనే విషయం అర్థమైంది. అయితే హీరో ఎవరనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం. సుకుమార్ రాంచరణ్ తో మూవీ చేయనున్నాడట. అయితే సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా సెట్ అయినట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఇద్దరి హీరోలలో సుక్కు తన తరువాతి మూవీ తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -