- Advertisement -
బహుబలి సినిమా తరువాత భాగమతి సినిమాతో హిట్ కొట్టిన జేజమ్మ సడన్గా కేదార్నాథ్ యాత్రతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక అనుష్కకు దైవ భక్తి కూడా చాలా ఎక్కువే. ఎప్పటి నుంచో కేదార్ నాథ్ వెళ్లాలని అనుకుంటున్న అనుష్కకు ఈ మధ్య సమయం దొరకడంతో అక్కడికి వెళ్లి తన ఇష్ట దైవాన్ని దర్శించుకుంది.
సాధారణ యువతి లాగా అనుష్క అక్కడికి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. అనుష్క తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సింపుల్ గా మెయింటైన్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే.ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.