Sunday, May 19, 2024
- Advertisement -

సెన్సార్ బోర్డు పై అర‌వింద్ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

సెన్సార్ బోర్డుపై ధృవ సినిమా విల‌న్ అర‌వింద్ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సెన్సార్ బోర్డు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై భార‌త సినీ ప‌రిశ్ర‌మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఉడ్తా పంజాబ్ సినిమాతో సెన్సార్ బోర్డుపై చిత్ర పరిశ్ర‌మ కొన‌సాగిస్తున్న ఆందోళ‌న‌లు ప‌ద్మావ‌తి సినిమాతో తార స్థాయికి చేరాయి. ఇప్పుడు సెన్సార్ బోర్డుపై త‌మిళ న‌టుడు అర‌వింద్ స్వామి విమ‌ర్శ‌లు చేశారు.

‘ఇప్పుడు భార‌త‌దేశంలో జనాలు మరీ సెన్సిటివ్ అయిపోతున్నారు. ఒక ముద్దు సీన్ తీయాలంటే భయమేస్తుంది. దాదాపు రెండు వేల ఏళ్ల కింద‌ట వాత్సాయన రచించిన ‘కామసూత్ర’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ముద్దు అనేది ప్రేమకు సూచిక అలాంటిది వాటికి వ్యతిరేకతను చూపిస్తూ సెన్సార్ ఎందుకు వ్యవహరిస్తుందో నాకు అర్ధం కావడం లేదు’ అంటూ సెన్సార్ కత్తెరపై ఫైరయ్యాడు అరవింద్ స్వామి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -