Thursday, April 25, 2024
- Advertisement -

బాలయ్యపై నాగబాబు ఫైర్.. కానీ చిరుతో బాలయ్య సైరా..!

- Advertisement -

సినీ పరిశ్రమలో ఏం జరిగిన అవి సర్ ఫ్రైజ్ లుగా మారుతుంటాయి. కొన్నిసార్లు ఈగోలు చూపించే మన హీరోలు.. కొన్నిసార్లు మంచిగా కలిసి కనిపిస్తారు. ఇక స్టార్ హీరోల మధ్య పోటీ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. సినీ పరిశ్రమ బాగు కోసం.. ఏదైన అభివృద్ది కోసం స్టార్స్ అందరు కలిసి సాయం చేయడం మనం చూస్తునే ఉంటాం.

ఇక ఒక స్టార్ హీరో సినిమా హిట్ అవుతే మరో స్టార్ హీరో అభినందించడం.. స్టార్ హీరో సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయడం.. సెలబ్రెట్ చేసుకోవడం వంటివి టాలీవుడ్ లో జరుగుతునే ఉన్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ’సైరా నరసింహారెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దూసుకెళ్తోంది. అయితే తాజాగా సైరా సక్సెస్ పార్టీలో నందమూరి బాలయ్య చేసిన సందడి ఫిలిం వర్గాల్లో చర్చకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి తో పాటు, దర్శకుడు సురేందర్ రెడ్డిని, కొణిదెల ప్రొడక్షన్ ను ఆయన అభినందించారు. సరదగా టైం స్పెండ్ చేసి డిన్నర్ పార్టీని ఆస్వాధించారు. గత ఎన్నికల్లో మెగా, నందమూరి వార్ నడిచిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాలు, సినిమాలు వేరే అని మరోసారి ప్రూవైంది. నాగబాబు, బాలయ్య మధ్య వార్ నడిచిన.. అది ఎన్నికల వరకే పరిమితమని అర్దం అవుతుంది. టి.సుబ్బరామిరెడ్డి ఇచ్చిన సక్సెస్ పార్టీ ఇది.

ఈ పార్టీలో స్టార్ హీరోయిన్స్, సీనియర్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. హైదరబాద్ పార్క్ హయత్ లో జరిగిన ఈ పార్టీలో బాలకృష్ణతో పాటు వెంకటేష్, కృష్ణంరాజు సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా సైరా కోసం పడ్డ శ్రమను గుర్తు చేసుకున్నారు. మురళి మోహన్, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, రఘురామ కృష్ణంరాజు తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -