Sunday, May 5, 2024
- Advertisement -

బాలీవుడ్ లో అడుగు పెడుతున్న బెల్లంకొండ

- Advertisement -

బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద నిర్మాతల్లో ఒకడు. అయితే ఆయన ఇప్పుడు చురుకుగా సినిమా నిర్మాణం చేయడం లేదు కానీ ఆయన కుమారుడు శ్రీనివాస్ కెరీర్ ని మాత్రం దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు అనే సినిమా తో విజయం సాధించడం తో సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలని మీడియా కి తెలిపారు.

“మా అబ్బాయికి రాక్షసుడు మంచి పేరు తీసుకొచ్చింది. సాయి చేసిన గత 6 సినిమాలు తనకు ఎలాంటి పేరు తీసుకురాలేదు. రాక్షసుడు సాయికి పేరుతోపాటు డబ్బు కూడా తీసుకొస్తుంది నిర్మాత కోనేరు సత్యనారాయణకు నా ధన్యవాదాలు. రీమేక్ చిత్రాన్ని ఎక్కడా చెడగొట్టకుండా దర్శకుడు రమేష్ వర్మ పనిచేశారు. సౌత్ లో నెంబర్ 1 సినిమాలున్న హీరో మా అబ్బాయి కొన్ని సినిమాలు తెలుగులో ఆర్థికంగా నష్టపోయినా హిందీలో మంచి వసూళ్లు రాబట్టాయి. సకాలంలో రాక్షసుడు విడుదల చేయడం వల్ల విజయవంతమైంది. మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్ కు 10 లక్షలు ఇస్తాను. మా అబ్బాయిని త్వరలోనే బాలీవుడ్ లో పరిచయం చేయబోతున్నా. అలాగే దిల్ రాజు బ్యానర్ లో మా అబ్బాయిది నెక్స్ట్ సినిమా ఉంటుంది.” అని ఆయన తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -