బెల్లకొండ శ్రీనివాస్ ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ప్రయత్నస్తునే ఉ న్నాడు.మొదటి సినిమాతో అల్లుడు శీనుతో హిట్ కొట్టిన బెల్లంకొండ తరువాత వరుస ప్లాప్లను చవి చూశాడు.స్టార్ బోయపాటి శీనుతో తీసిన జయ జానికి నాయక సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు.ఎన్నో ఆశలు పెట్టుకున్న సాక్ష్యం సినిమా ఘెరంగా ఫెయిల్ అయింది.ఇక బెల్లంకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కవచం.శ్రీనివాస్ మామిళ్ళ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాఉంనారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.’భయపెట్టే వాడికి భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడు ఉంటాడు రా.. వాడే పోలీస్’.. ‘పోలీసోడితో ఆడాలంటే బులెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్ గా ఉండాలి’ అంటూ హీరో చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటించగా పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘కవచం’ షూటింగ్ పూర్తయింది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక సినిమాను వచ్చే డిసంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.