బిగ్బాస్ రెండో సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నిన్నటి ఎపిసోడ్లో శ్యామల ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ ఏడుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు విన్నర్ అవుతారో అనే ఆసక్తి అందరిలోనే ఉంది.తాజాగా సోమవారం జరిగే ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు బిగ్బాస్ టీం.బిగ్బాస్ ఇంటి సభ్యులకు ‘ఫుల్లీ ఛార్జెడ్ అప్’ అనే టాస్క్ ఇచ్చారు. దీనికోసం హౌస్మెట్స్ రెండు టీమ్లుగా విడిపోయి తమకు ఇచ్చిన టాస్క్ని పూర్తి చేయాలి. ప్రోమోని బట్టి ఇదొక ఫిజికల్ టాస్క్ అని తెలుస్తోంది.
మరోసారి ఒకరినొకరు తోసుకొని, ఎవరిలో ఎంత దమ్ముందో చూపించుకునే టాస్క్ ఇది. తనీష్, సామ్రాట్, అమిత్ ల మధ్య తోపులాట ఓ రేంజ్లో జరగబోతోంది.దీప్తి కూడా ఎక్కడ తగ్గడం లేదు.ఎప్పటిలాగే ఇలాంటి టాస్క్లకు దూరంగా ఉండే గీతా మాధురి దానినే కంటిన్యూ చేసినట్లు కనపించింది.ఇక టాస్క్ పూర్తి అయిన తరువాత ఎలిమినేషన్స్కు నామినేషన్ ప్రక్రియ జరగనుంది.కౌశల్ ఈ వారం కూడా ఎలిమినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.మరి ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారోయ చూడాలి.