నటి సోఫియా హయత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కొన్ని రోజులు క్రితం ఆమె తన సోషల్ మీడియాలో చేసిన ట్విట్స్ వైరల్ మారాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనకున్న బంధం గురించి ట్విట్ చేసింది సోఫియా హయత్. కోహ్లీతో నేను డేటింగ్ చేశానని, కొంతకాలంగా ప్రైవేట్గా తిరిగామని చెప్పుకొచ్చింది. దీంతో కోహ్లీ అభిమానులు సోఫియాపై రెచ్చిపోయారు.దీంతో ఆ విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన సోఫియా, విరాట్ నేను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. తాజాగా మళ్లీ మరో క్రికెటర్ గురించి ట్విట్ చేసింది సోఫియా.
టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి ట్విట్ చేసింది ఈ భామ. రోహిత్ తో ఒకప్పుడు ప్రేమలో ఉన్న మాట నిజమేనని చెప్పిన సోఫియా 2012లో ఇద్దరూ డేటింగ్ చేసినట్లు స్పష్టం చేసింది. మేం కలిసిన మొదటిసారే రోహిత్ తనకు ముద్దు పెట్టాడని చెప్పుకొచ్చింది. లండన్లోని ఓ హోటల్లో తామిద్దరం ఏకాంతంగా కలిశామని చెప్పింది. సోఫియా త్వరలోనే తన జీవితంపై ఓ పుస్తకం రాయాలనుకుంటున్నట్లు మీడియాతో చెప్పింది.
- పరకాల ల్యాబ్ టెక్నీషియన్ మృతి కేసులో సంచలన ట్విస్ట్!
- కన్నతల్లి కామ పిశాచిగా మారి.. ఐదేళ్ల పాపను..
- రుతుపవనాలు ఎంట్రీ..కానీ సీన్ రివర్స్!
- సామాన్యుడికి మరో షాక్..గ్యాస్ ధర మళ్లీ పెంపు
- న్యూజిలాండ్ను వరణుడు కాపాడేనా?
