నా లోకేష్ బాబు మీద ఒట్టేసి చెబుతున్నా అని చంద్రబాబు ప్రమాణం చేశారట. ఎప్పుడు? ఎక్కడా? అసలు ఆ ఓట్టు ఎందుకు వేశారు? ఏ అంశంపై మాట తప్పనని ఆ ఒట్టు వేశారు? ప్రస్తుతం ఇన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి రామ్గోపాల్ వర్మకు. ఇదేదో బహిరంగంగా కాదు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండో ట్రయిలర్ ఈ సీన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తొలి ట్రైలర్ తో సంచలనం రేపిన దర్శకుడు ఆర్జీవీ రెండో ట్రయిలర్ తో మరింత సంచలనం రేకెత్తించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రయిలర్ లో తెలుగుదేశం పార్టీకి చెందినవారు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరి క్యారెక్టర్లు చూపించేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు పాత్రధారి నోట ‘నా లోకేష్ బాబు మీద ఒట్టేసి చెబుతున్నా’ అనే డైలాగు కూడా ట్రయిలర్ లో వుందని తెలుస్తోంది. అలాగే పురంధేశ్వరి పాత్ర నోట.. ‘ఏమే దొంగ…. అంత మంది హీరోయిన్లను వదిలేసి, నీ వెంటపడ్డాడే’ అన్న డైలాగు వినిపిస్తుందని కూడా తెలుస్తోంది. తొలి ట్రయిలర్, మలి ట్రయిలర్ అంటూ వీటితోనే సినిమా చూపించేలా వున్నారు ఆర్జీవీ. ఇక ఈ మూవీ 9 లేదా 11న సెన్సారు వుంటుంది. 15కు విడుదల అనుకున్నారు కానీ, కొంత పోస్ట్ ప్రొడక్షన్ వుండిపోవడంతో మళ్లీ 22కే వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక చంద్రబాబు ఓట్ల విషయానికి వస్తే.. అప్పుడెప్పుడో మసీదు మీద ప్రమాణం చేసి ఇకమీద బీజేపీతో పొత్తు పెట్టుకొను అన్నారు. అది ఎంత వరకు నిలబెట్టుకున్నారో అందరికి తెలుసు. ఇక లోకేష్ మీద ప్రమాణం సంగతేంటో సినిమా విడుదలైతే కానీ తెలీదు.