మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిన్న(మంగళవారం) ఆయన నటిస్తున్న సైరా మూవీ టీజర్ను విడుదల చేశారు చిత్ర నిర్మాత రామ్ చరణ్.మెగా అభిమానులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఈ టీజర్ను విడుదల చేశారు.ఈ టీజర్ను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 11 మిలియన్ల డిజిటల్ వ్యూస్ లభించాయి. దీనిని బట్టి చిరంజీవి స్టామినా ఏంటో ఇట్టే అర్థం అవుతుంది. ‘సైరా’ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్కి అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ టీజర్ సూపర్బ్ గా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
300 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీతారాగణం,సాంకేతిక విలువలతో తీస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తి అందరిలోను ఉంది.ఉద్యమకారుడైన ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను సైరా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తుంది.తమన్నా,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,జగపతిబాబు వంటి తారలు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.