Friday, April 19, 2024
- Advertisement -

సురేశ్ బాబుతో మాట్లాడి పెళ్లి చేసుకో అన్నారు : శ్రీరెడ్డి

- Advertisement -

ఎప్పుడూ సంచలనలతో బిజీగా ఉండే శ్రీరెడ్డి.. తాజాగా తన యూట్యూబ్ లో లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. “పెళ్లి మీద ఆసక్తి లేదు. కేవలం సమాజసేవ చేయాలనుకుంటున్నాను. నేను గతంలో తప్పు చేసి ఉండొచ్చు.. కానీ నేను చేసే మంచు పనులు చూసి నా ఫాలోవర్స్ కొంతలో కొంత స్పూర్తి చెందితే చాలు.

అలానే నేను హాట్ గా కనిపించడం కోసం ఏదైన చేస్తాను. అలానే శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాను. కొత్తవారికి అవకాశం ఇవ్వడానికే ఇది ప్రారంభించబోతున్నాను. హైదరబాద్ లో ఓ మహిళ ఎదుగుతుందంటే.. ఎవరు సాయం చేశారో.. లేకపోతే ఎవరితోనో పడుకుంది కాబట్టి అవకాశాలు వచ్చాయనో అంటారు. కానీ తమిళనాడులో అలాంటి అవమానాలు.. కామెంట్స్ అసలు ఉండవు. ఇక నా జీవితాన్ని మార్చింది ఎవరంటే.. చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన ప్రసంగాలు వినే నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను.

ఇక పెళ్లి గురించి అలోచిస్తే భర్త, పిల్లలు.. వారి కోసం కష్టపడాలి. అందుకే వాటికి దూరం. చిన్న లైఫ్ ఇది ప్రశాంతంగా గడపలనుకుంటాను. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారితో సమయం గడిపితే.. మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇక నేను పార్టీలకు వెళ్తే వేరే కల్చర్ ఫాలో అవుతాను. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పద్ధతిగా ఉంటాను. ఆడపిల్లలు గట్టిగా లేకుంటే భయపడే నాథుడు ఉండడు.

నేను ఒకప్పుడు మీడియా ముందుకు వచ్చి అన్నీ బయటపెట్టాక చాలా మంది అమ్మాయిలు ఫోన్లు చేసి నీలాగా మేమూ ధైర్యవంతులుగా ఉంటే చాలక్కా అన్నారు. అంతేకాకుండా సురేష్ బాబుతో మాట్లాడి అభిరాంను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా అక్కా అని చాలా మంది సలహాలు ఇచ్చారు. వారందరికీ నేను ఇచ్చే జవాబు ఒక్కటే.. ఎన్ని కోట్లు ఉన్నా ప్రశాంతత అనేది ఒకటి ఉంటుంది. అది లేకపోతే బీపీ, షుగర్, గుండెనొప్పులు వస్తాయి. మనకు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండటం కావాలి. అవి లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉండి కూడా లాభం లేదు” అని శ్రీరెడ్డీ చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -