మహనటి సినిమా సావిత్రిగారి కుటుంబంలో విభేదాలు తీసుకువచ్చిందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.అలనాటి నటి సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్వీన్.సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన సంగతి తెలిసింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. సినిమా కలెక్షన్లు కూడా అదే విధాంగా ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించి మమ్మల్ని ఎవరు సంప్రదించలేదని అంటున్నారు జెమిని గణేశన్ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్.
మా నాన్నను సినిమాలో చెడుగా చూపించారని ఆమె నిన్న(గురువారం)మీడియా ఎదుట ఆమె ఆరోపించారు. సినిమా బృందం సావిత్రిగారి కుమార్తెను ఎలా సంప్రదించారో అలాగే జెమిని గణేశన్ కుమార్తెలను కూడా కలిస్తే బాగుండేదని ఆమె తెలిపింది. మేము అంతా బాగానే ఉంటామని అప్పడప్పుడు అందరం కలిస్తామని తెలిపింది.అయితే దీనిపై సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి స్పందించారు.మా అమ్మ జీవితంలో జరిగిన వాస్తవలనే చూపించారని సినిమా చాలా బాగుందని అమ్మను అందరు కలిసి మోసం చేశారని తెలిపింది.అమ్మ చివరి రోజులలో ఎవరు పట్టించుకొలేదని ,సహాయం కూడా ఎవరు చేయలేదని చెప్పారు విజయ చాముండేశ్వరి.
అయితే మహనటి సినిమా విషయంలో ఇటు సావిత్రి కుమార్తెకు,అటు జెమిని గణేశన్ కుమార్తెకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని మాట వాస్తవమే.సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అంటారు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి.కాదు ఆమెకు అంతకముందే మద్యం అలవాటు ఉందని అంటున్నారు గణేశన్ మొదటి భార్య కుమార్తె కమలా సెల్వరాజ్.అయితే సావిత్రి ఆస్తులను నాన్న(జెమిని గణేశన్) తీసుకొలేదని,నాన్నకే చాలా ఆస్తులు ఉన్నాయని ,సావిత్రిగారే సినిమాలను నిర్మించి డబ్బులు పొగొట్టుకున్నారని తెలిపింది కమలా సెల్వరాజ్.
ఇది తప్పు అని చెప్పటానికి వెళ్తే నాన్న(జెమిని గణేశన్) నా మీదకు కుక్కను వదిలి పారిపొయ్యేలా చేసిందని,తను(సావిత్రి) హాస్పటల్లో ఉన్నప్పుడు కూడా నాన్నే ఫీజు కట్టారని తెలిపింది.నాన్న ఎవరి జీవితాలను నాశనం చేయలేదని,వారికి నచ్చే నాన్న దగ్గరకు వచ్చేవారని తెలిపింది. అయితే సినిమాలో నాన్న గురించి పూర్తి విరుద్దంగా చూపించారని,వాస్తవాలు వేరే ఉన్నయాని వాటిని చూపిస్తే బాగుండేది అని చెప్పారు.మరి ఈ సినిమాపై ఇప్పటి వరకు స్పందించలేదు జెమిని గణేశన్ మరో భార్య కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ రేఖ.