Monday, May 6, 2024
- Advertisement -

పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన హరీష్ శంకర్

- Advertisement -

ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ‘వాల్మీకి’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ‘జిగర్తాండ’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అంతకుముందు మృణాలిని రవి ని హీరోయిన్ గా అనుకున్నారని, కానీ తరువాత ఆమెను తీసేసి పూజ హెగ్డే తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం పూజ హెగ్డే ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడాయి.

అయితే ఆ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదని హరీష్ శంకర్ కొట్టిపారేశారు. తాజాగా పూజ హెగ్డే సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఒకే ఒక ట్వీట్ తో మళ్లీ ఆ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాడు దర్శకుడు. “త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ టీజర్ను విడుదల చేసి మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని సోషల్ మీడియాలో తెలిపిన హరీష్ శంకర్ వరుణ్తేజ్, అథర్వ మురళి, పూజ హెగ్డే పేరుని కూడా ట్విట్టర్ లో జత చేశాడు. పూజా హెగ్డే హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనే విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -