Saturday, May 25, 2024
- Advertisement -

బాలయ్యతో సినిమా తన డ్రీమ్ అంటున్న దర్శకుడు

- Advertisement -

గత కొంత కాలంగా వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 18 వ తారీఖున విడుదల కాబోతోంది. ఈసారి పూరి జగన్నాథ్ ఖచ్చితంగా ఒక మంచి హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాధ్ మరియు రామ్ ఇద్దరు సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

ఒకవైపు సినిమా ప్రమోషన్లలో చాలా బిజీ బిజీ గా ఉన్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. ఎప్పటికైనా బాలకృష్ణ తో మళ్లీ ఒక సినిమా చేయాలని పూరి జగన్నాథ్ అనుకుంటున్నారట. పైసావసూల్ సినిమా సమయంలో బాలయ్య సింప్లిసిటీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను అని, సినిమా ఫ్లాప్ అవ్వడం తమ దురదృష్టమని అందుకే బాలకృష్ణ తో మరొక సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు. మరి బాలయ్య పూరికి మరొక అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -