ప్రముఖ జీ తెలుగు ఛానెల్లో డ్రామా జూనియర్స్ అనే ప్రొగ్రామ్ గత రెండు సంవత్సరాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో చిన్న పిల్లలు చేసే కామెడీకి మంచి ఆదరణ ఉంది.దీంతో ఈ ప్రొగ్రామ్ మూడో సీజన్ మొదలెట్టారు జీ తెలుగు యాజమాన్యం.ఈ షోలో ఆదివారం ప్రసారమైన ఈ ప్రొగ్రామ్లో ఓ స్కీట్ అందరిని కట్టిపడేసింది.ఇంతకీ ఆ స్కీట్ ఏంటీ అనుకుంటున్నారా..? అదేనండీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే తమ బాధను పలువురు చెప్పుకున్నారు. దీనికి #మీటూ అనే పెట్టిన సంగతి తెలిసింది.దీనిని ప్రధాన పాయింట్గా తీసుకుని డ్రామా జూనియర్స్లోని పిల్లలు ఓ స్కీట్ చేశారు.
ఉద్యోగం చేసే దగ్గర తమ తోటి ఉద్యోగి నుంచి ఎదురైన లైంగిక వేధింపుల గురించి మహిళ ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తరువాత సమాజంతో పాటు,తన ఇంటిలో ఆ మహిళకు ఎటువంటి పరిణమాలు ఎదురైయ్యాయ్యో అని ఈ స్కీట్లో చూపించారు.ఈ స్కీట్ చేస్తున్న సమయంలో సెట్లో ఉన్నవారు సైతం కంట కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. చిన్న పిల్లలు అయిన కూడా తమకు ఉన్న నాలెడ్జ్తో బాగా యాక్ట్ చేశారు.ఈ స్కీట్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. టీవీలో ఈ స్కీట్ చూడని చాలమంది యూట్యూబ్లో వెతకడం విశేషం.ఈ ప్రొగామ్కు శ్రీముఖి యాంకర్గా చేస్తుండగా..ఆలీ,ఓంకార్,అనసూయలు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
https://www.facebook.com/zeetelugu/videos/307588503190545/