ఫలక్నుమా దాస్ సినిమా విడుదల అయ్యి అనేక నెగటివ్ టాక్ ని ఆకర్షించింది. ఈ సినిమా మీద ఇప్పుడు ఇండస్ట్రీ లో అంతా చర్చించుకుంటున్న సంగతి మనకి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన విశ్వక్ సేన్ అనేక విషయాల గురించి, తన చుట్టూ పెరుగుతూ వస్తున్న వివాదానికి సంబంధించి మాట్లాడాడు. ముందుగా అసభ్య పదజాలాన్ని వాడినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాడు.
“నేను ఏ రివ్యూ రైటర్ను కానీ.. ఏ మీడియా వాళ్లను కానీ.. ఏ హీరోను కానీ విమర్శించలేదు. నా సినిమా ప్రమోషన్స్తో నేను బిజీగా ఉన్నాను. కానీ కొందరు మాత్రం నా సినిమాను కావాలనే టార్గెట్ చేసి.. నష్టం చేయడానికి చూస్తున్నారు. వాళ్లను విమర్శించాను కానీ ఎవర్నీ పర్సనల్గా టార్గెట్ చేసి అన్న మాటలు కావు.” అని హీరో విశ్వక్ సేన్ వాపోయాడు.
అంతే కాకుండా తన తన సినిమా శుక్రవారం విడుదల అయినా అన్ని సినిమాల కన్నా ఎక్కువ డబ్బులు రాబట్టింది అని, ఆ వీకెండ్ కి అన్ని సినిమాల్లోకెల్లా తన సినిమా నే ఎక్కువ గ్రాస్ వసూల్ చేసింది అని సంతోషం వ్యక్తం చేసాడు. అలాగే తన తండి, నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమ లో అందరూ తమకి సపోర్ట్ చేశారని, పైరసీ విషయం లో కూడా సహాయ సహకారాలు బాగున్నాయని, చిత్రాన్ని మరింత ఆదరించాలి అని ప్రేక్షకులకి విజ్ఞప్తి చేసాడు.