- Advertisement -
సూపర్స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.ఈ వార్త వింటే ఇంకా అభిమానులకు పండగ వచ్చినట్లే.మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన బుధవారం సాయత్రం వెలువడనుంది.
‘సూపర్ స్టార్ అభిమానులు సిద్ధంగా ఉండండి. భరత్ అనే నేను సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు రానుంది’ అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ కానుంది.

