- Advertisement -
ఈ ఫోటోలో ఉన్నది రాజ్ తరుణ్ చూడగానే గుర్తు పట్టడం కొంచెం కష్టంలేండీ. రాజ్ కొత్త సినిమా ‘లవర్’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రతి కొత్త సినిమా విడుదల సందర్భంగా నిర్మాత రాజు తిరుమలకు వెళ్తుంటాడు. ఆయనతో పాటు హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా తిరుమల వెళ్లారు. రాజ్ గుండుతో గుడి బయట కనిపించగా చాలామంది ముందు అతడిని గుర్తు పట్టలేదు.
కొంతసేపటి తర్వాత కానీ అతను రాజ్ అన్న సంగతి జనాలకు తెలియలేదు. దీంతో కొందరు అతడితో ఫొటోలు దిగారు. రాజ్ వెంట హీరోయిన్ రిద్ధి కూడా ఉంది. రాజ్ తరుణ్తో పాటు లవర్ సినిమా హీరోయిన్ రిద్ధి కూడా అతనితో పాటు ఉంది.ఇక లవర్ సినిమా కూడా రాజ్ తరుణ్కు చేదు అనుభవాన్నే మిగిల్చింది.దీంతో రాజ్ తరుణ్ కెరీర్పై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి.