యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అరవింద సమేత.దసరాకి విడుదల కానున్న ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(మంగళవారం) హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం భావోద్వేగంతో సాగింది.ఎన్టీఆర్ తండ్రి మాజీ ఎంపీ హరికృష్ణ నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.దీంతో అరవింద సమేత సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని భావించారు అంత,కాని తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ,తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదు రోజులకే అరవింద సమేత షూటింగ్లో పాల్గొన్నాడు ఎన్టీఆర్.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ చాలా ఎమోషన్ల్గా మాట్లాడాడు.ఎన్టీఆర్ మాట్లుతున్నంత సేపు కళ్లలో కన్నీరు ఊబికి వస్తునే ఉన్నాయి.తన తండ్రి నేర్పించిన వృత్తి పట్ల అంకిత భావాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయనని తెలిపాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ బాధపడటాన్ని చూసి హీరో రామ్ చరణ్ స్పందించాడు.ఎన్టీఆర్,రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే.పైగా ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలో కూడా నటిస్తున్నారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తారక్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ,నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేను నీకు ఎప్పుడు అండగా మేం అంతా ఉన్నాం అని ఎన్టీఆర్కు భరోసా ఇచ్చాడు రామ్ చరణ్.