ఢిల్లీకి చెందిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మినీషా లంబా బాలీవుడ్లో హీరోయిన్ గా బచ్నా యే హసీనా, కిడ్నాప్, అనామికా, జోకర్ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తెనాలి రామ, ఇంటర్నెట్ వాలా వంటి అనేక టీవీషోలలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువైంది.హిందీ బుల్లితెర రియాల్టీ షో బిగ్బాస్ 8 సీజన్లో పాల్గొనీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
బాలీవుడ్ హీరోయిన్ మినీషా లంబా రియాన్ థామ్ అనే నైట్క్లబ్ యజమానిని వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది.ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన మినీషా లంబ విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదని, సరైన వ్యక్తి తారసపడితే సరికొత్త ఆనందాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.
Also read:అర్ధరాత్రి 12 గంటలకు విడుదల కానున్న ధనుష్ సినిమా..?
అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంతోషంగా జీవించే హక్కు ఉంటుంది.కానీ సమాజంలో విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూడటం చాలా మందికి అలవాటు.గతాన్ని మర్చిపోయి ముందుకు సాగితేనే మనశ్శాంతిగా బతకవచ్చని, తాను ప్రస్తుతం అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను మంచి వ్యక్తిత్వం గల ఓ మనిషితో ప్రేమలో ఉన్నాను. నాకు మరోసారి నా ప్రేమ లభించింది. అంటూ తన ప్రేమ గురించి తన అభిమానులతో పంచుకుంది.
Also read:మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?