కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్న కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటించడం వల్ల ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ధనుష్ నటించిన చిత్రం ‘జగమే తందిరమ్’(తెలుగులో ‘జగమే తంత్రం’). ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధనుష్ కెరియర్లో 40వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ పక్కన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 18న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రాన్ని ఏకంగా 190 దేశాలలో 17 భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయడానికి నెట్ఫ్లిక్స్ అన్ని ఏర్పాట్లు చేసింది.
Also read:లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
సాధారణంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ముందు రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ధనుష్ నటించిన ఈ సినిమా మాత్రం ముందు రోజు అర్ధరాత్రి నుంచి కాకుండా శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా మాతృభాష తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోలిష్, పోర్చుగీస్, బ్రెజిలియన్, స్పానిష్, థాయ్, ఇండోనేషియా వంటి తదితర భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.