Monday, April 29, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌కు షాకిచ్చిన హైకోర్టు

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స్థ‌లం వివాదంలో ఇరుక్కున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని శేర్‌లింగంప‌ల్లిలోని ప్ర‌భస్ గెస్ట్ హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీంతో తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని ప్రభాస్ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. చట్టబద్ధంగా కొనుగోలు చేశామనీ, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు ఉమ్మడి హైకోర్టు విచారించింది.

కావ‌ల‌నే రెవెన్యూ అధికారులు త‌మ స్థ‌లాన్ని సీజ్ చేశార‌ని ప్ర‌భాస్ త‌రుపున న్యాయవాదులు త‌మ వాద‌నలను న్యాయ‌స్థానం ముందుంచారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అయితే ఈ స్థ‌ల వివాదంలో ప్ర‌భాస్‌కు న్యాయం జ‌ర‌గ‌టం క‌ష్ట‌మ‌నే మాటాలు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ గెస్ట్ హౌస్ ప్ర‌భుత్వ స్థ‌లంలోనే ఉంద‌ని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -