తెలుగు మహిళ దర్శకురాలు డైరెక్టర్ జయ గురువారం రాత్రి గుండె నొప్పితో మరణించిన సంగతి తెలిసిందే.ఆమె మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, నమ్రతా, నటుడు ఆది, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఆయన కుమారుడు ఆకాశ్ పూరీ, సుధీర్ బాబు, మంచు మనోజ్, డైరెక్టర్ నందినీ రెడ్డి, డ్యాన్స్ మాష్టర్ శేఖర్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఉత్తేజ్ తదితరలు ఆమె నివాసానికి చేరుకొని నివాళులర్పించారు.
2002లో దీపక్, అంకిత జంటగా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రంతో చిత్ర దర్శకురాలిగా మారారు.చంటిగాడు ,ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. జర్నలిస్టుగా ఆమె తన కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను ప్రారంభించారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెం గ్రామంలో జన్మించారు.ఇక ఆమె భర్త బిఏ రాజు తెలుగు ఇండస్ట్రీకి పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.