యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబళి సినిమాతో నార్త్, సౌత్లో భారీగా ఉండబోతోంది. ప్రస్తుతానికి బహుబళి పార్ట్1 రిలీజ్కు సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మూవీ అనగానే భారీ అంచనాలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉంటాయి. కాబట్టి రాబోయే సినిమాలలో మంచి స్క్రిఫ్ట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రభాస్ అభిప్రాయపడుతున్నాడు.
అందుకు అనుగుణంగానే కథ నచ్చి ’రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా అప్పుడే షూటింగ్ వరకు వెళ్ళకపోవచ్చని తాజా సమాచారం. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ చెప్పిన స్టోరీ లైన్ ప్రభాస్కు నచ్చి, పూర్తి స్క్రిఫ్ట్ రెడీ చేసి తీసుకు రమ్మని చెప్పాడట. దాంతో ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ బ్యానర్లో వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించాలనుకున్నారు. వంశీ, ప్రమోద్ ఇద్దరూ ప్రభాస్కి చాలా దగ్గర సన్నిహితులు కావటంతో ఈ సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. కానీ సుజిత్ తయారుచేసిన పూర్తి స్క్రిఫ్ట్ ప్రభాస్ విని అప్సెట్ అయ్యాడట. ప్రభాస్కి స్క్రిఫ్ట్ నచ్చలేదట.
సినిమాని త్వరగా సెట్ మీదకు తీసుకెళ్ళాలని ఇలా ఆలోచించవద్దని, మళ్ళీ మంచి స్క్రిఫ్ట్ వర్కవుట్ చేయమని సుజిత్కి, వంశీ, ప్రమోద్లకు ప్రభాస్ సూచించాడట. స్క్రిఫ్ట్ నచ్చితేనే ప్రభాస్ ఈ సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ సమాచారం. దీంతో ఇక సుజిత్ సినిమా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ లోపు వేరే డైరెక్టర్లు చెప్పిన కథ ప్రభాస్కి నచ్చితే తొందరలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.