Sunday, April 28, 2024
- Advertisement -

మ‌హ‌ర్షి నిర్మాత దిల్ రాజు ఆఫీస్‌పై ఐటీ దాడులు…

- Advertisement -

మహర్షి సినిమాపై టికెట్ల రేట్ల పెంపు విష‌యంలో గ‌తంద‌ర‌గోలం నెల‌కొంది. భారీ బడ్జెట్‌ సినిమా కావటంతో ఎక్స్‌ట్రా షోస్‌ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతించాల్సిందిగా కోరామని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు.అదే సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు కోర్టు అనుమతించినట్టుగా తెలిపారు. దిల్‌రాజు చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి త‌ల‌సాని ఖండించారు. టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు.

ఈ వివాదం కొన‌సాగుతుంగానె నిర్మాత దిల్ రాజు ఆఫీస్ పై ఐటి అధికారులు దాడులు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం.మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా మే 9 వ తేదీన అంటే రేపు రిలీజ్ కాబోతున్న తరుణంలో ఐటి దాడులు జరగడం క‌ల‌క‌లంరేపుతోంది.

పు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్లపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే పలు భారీ చిత్రాల రిలీజ్ సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -