ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఎన్టీఆర్ యాంకరింగ్ సపోర్ట్తో తెలుగు బుల్లితెరపై గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ మేనేజ్మెంట్కి సాచి లెంపకాయ కొట్టిన రేంజ్లో షాకిచ్చాడు ఎన్టీఆర్. బిగ్ బాస్ పెద్దల ఆఫర్ కూడా అంత అథమస్థాయిలోనే ఉంది మరి. సినిమా నటుల ఎమోషన్స్ అంటే మరీ అంత ఛీప్ అనుకున్నారో లేక భారీ అమౌంట్ ఆఫర్కి ఒప్పుకుంటాడులే అన్న నమ్మకంతో వెళ్ళారో కానీ రీసెంట్గా బిగ్ బాస్ పెద్దలు ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యారు.
సెకండ్ సీజన్లో రేటింగ్స్, క్రేజ్ కూడా పోగొట్టుకున్న బిగ్ బాస్కి థర్డ్ సీజన్లో భారీ క్రేజ్ రావాలంటే ముగింపు ఎపిసోడ్కి ఎన్టీఆర్ వచ్చి ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని వాళ్ళు భావించారు. అదే విషయం ఎన్టీఆర్కి చెప్పి భారీ అమౌంట్ కూడా ఆఫర్ చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వాళ్ళపై సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. మా నాన్న చనిపోయిన బాధలో నేనుంటే ఇలా అడగాలని ఎలా అనిపించింది? మినిమం కామన్సెన్స్ లేదా అంటూ వాళ్ళపై విరుచుకుపడ్డాడు. అదేంటి……సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ తిరిగి ప్రశ్నించడంతో…………‘అది వంద కోట్ల ప్రాజెక్ట్………..నేను షూటింగ్కి వెళ్ళకపోతే భారీగా నష్టం………అది కూడా ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్………..తప్పక చేస్తున్నాను………..కానీ కొత్తగా ఇప్పుడు డబ్బుల కోసం ఒక ప్రోగ్రాంకి ఒప్పుకుని కెమేరా ముందుకు వచ్చి ఎలా ఎంటర్టైన్ చేయగలననుకున్నారు………….నా ఎమోషన్స్ గురించి కనీసం ఆలోచించాలి కదా……..’ అంటూ ఘాటుగానే బిగ్ బాస్ మేనేజ్మెంట్కి ఆన్సర్ ఇచ్చాడట ఎన్టీఆర్. ఆ దెబ్బతో ఎన్టీఆర్కి సారీ చెప్పిన బిగ్ బాస్ మేనేజ్మెంట్ మళ్ళీ కలుస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిందని………..ఎన్టీఆర్ కరెక్ట్ సమాధానం చెప్పి పంపాడని సినిమా పెద్దలు అభిప్రాయపడుతున్నారు.