Saturday, April 20, 2024
- Advertisement -

అలియా భట్ సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది : కంగనా

- Advertisement -

బందుప్రీతిపై సినిమా పరిశ్రమలో రోజుకో వార్త వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటికే బంధుప్రీతిపై సంచలన కామెంట్స్ చేసింది. మరోసారి బంధుప్రీతిపై తీవ్ర విమర్శలు చేసింది కంగనా. సినీ అవార్డుల వేడుకల్లోనూ కొందరు నటులకు అవమానం జరుగుతుందని ఆమె తెలిపింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ’హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకి దీపిక పదుకుణేకు అవార్డు వచ్చిందని.. అయితే ఆమె తనకన్నా క్వీన్ సినిమాలో నటన బాగుందన్న విషయంను అంగీకరించిందని.. ఆ అవార్డును తిరస్కరించిందని తెలిపింది. మరోవైపు.. గల్లీ బాయ్ మూవీలో కేవలం 10 నిమిషాలు కనిపించిన అలీయా భట్ మాత్రం తనకు అవార్డు వస్తే కొంచెం కూడా సిగ్గు లేకుండా దాన్ని తీసుకుందని విమర్శించింది.

ఇటీవలే సూసైడ్ చేసుకున్న యంగ్ హీరో సుశాంత్ నటించిన చిచోర్ సినిమానికి కనీసం ప్రశంసలు కూడా దక్కలేదని కంగనా తెలిపింది. సుశాంత్ సినీ పరిశ్రమలో ఎదగకుండా బాలీవుడ్ మాఫియా ప్రయత్నించిందని తెలిపింది. డ్రైవ్ మూవీ ఆయన సినీ కెరీర్ ను నాశనం చేసిందని ఆమె చెప్పింది. ఆయన నటించిన ఆ మూవీని థియేటర్లో రిలీజ్ చేస్తే సత్తా కరణ్ జోహార్ కు లేదంటే తాను నమ్మను అని చెప్పింది. మ‌హేశ్ భ‌ట్‌తో పాటు క‌ర‌ణ్ జొహార్‌పై కేసు పెట్టినా త‌ప్పు లేదని కంగనా మండిపడింది.

పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి ? : శ్రద్ధా శ్రీనాథ్‌

వర్మ ’పవర్ స్టార్’మూవీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!

అనసూయ తొక్కేస్తున్న రష్మీ.. క్రేజ్ మాములుగా లేదు..!

ప్రభాస్ ’రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -