Sunday, May 5, 2024
- Advertisement -

స్టార్ హీరోయిన్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ నిత్యం ఏదో ఇక వివాదాల‌తో సవాసం చేస్తునే ఉంటారు.హీరో హృతిక్ రోషన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ మరోసారి చీటింగ్ కేసులో వార్తల్లో నిలిచింది. గతేడాది కంగనా ముంబై పాలీహిల్ లో రూ.20 కోట్ల విలువైన భవంతిని కొనుగోలు చేశారు.ఆ ఇల్లు కొనడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రకాష్ జీ రోహిర అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని కంగన, ఆమె సోదరి రంగోలీపై ముంబైలోకి ఖర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు.

అయితే ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డ‌బ్బులు చెల్లించామని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ దగ్గర ఉన్నాయని కంగనా తరపు లాయ‌ర్లు తెలుపుతున్నారు. ఈ వ్య‌వ‌హారంలో త‌నకు సంబంధం లేన‌ట్లుగా మ‌ణిక‌ర్ణిక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది కంగనా.ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -