- Advertisement -

ఆ వ్యక్తిని రాయితో కొట్టాను!

- Advertisement -

స్కూల్ రోజుల్లో తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని రాయితో కొట్టిన సంఘటనను కథానాయిక కయాదు లోహర్‌ తాజాగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కోపంతో తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు హింసాత్మకంగా అనిపిస్తున్నా, తప్పును ఎవరూ మౌనంగా భరించకూడదని ఆమె స్పష్టం చేశారు.

కయాదు పదో తరగతి చదువుతున్న రోజుల్లో ట్యూషన్‌కు వెళ్లే మార్గంలో కొందరు అబ్బాయిలు వేధించేవారని ఆమె తెలిపారు. రెండు రోజుల పాటు మౌనంగా ఉన్నా, మూడో రోజు భరించలేకపోయానని చెప్పారు. ఆవేశంతో రాయి తీసుకుని వారిపై విసరగా, ఒకరి తలకు గాయమై రక్తం కారిందని వివరించారు. ఆ సమయంలో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆమె పేర్కొన్నారు.

“ఇప్పుడు ఆ సంఘటన తలుచుకుంటే చాలా హింసాత్మకంగా అనిపిస్తోంది. కోపంలోనైనా సరే ఎదుటివారిని గాయపరచడం సరైన పద్ధతి కాదని అప్పుడు తెలుసుకున్నాను” అని కయాదు అన్నారు. అయితే, ఎవరైనా వేధించినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు మౌనంగా అంగీకరించకూడదని, మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. వేధింపులను అస్సలు సహించకూడదని యువతకు ఆమె సందేశం ఇచ్చారు.

కయాదు లోహర్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం ‘ఐ యామ్ గేమ్’, ‘ది ప్యారడైజ్’ మరియు ‘సూర్య 48’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా సమాజంలో మహిళా భద్రతపై ఆమె చర్చను రేకెత్తిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -