అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఈ తరం వారికి పెద్దగా ఎవరికి తెలియకపోచ్చు గాని,అప్పటి తరం వారిని శ్రీ దేవి గురించి అడిగితే మాత్రం కథలు ,కథలుగా ఆమె అందం గురించి వర్ణిస్తారు.ఆమె మరణించకముందే కూతురు జాన్వీ కపూర్ని హీరోయిన్గా పరిచియం చేయలనుకుంది శ్రీదేవి.కాని శ్రీదేవి హఠాత్తుగా మరణించడంతో ఆ కోరిక తీరకముందే మరణించింది.జాన్వీ కపూర్ `ధడక్` చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే జాన్వీ నటనకు మాత్రం ఎవరూ పేరు పెట్టలేదు. కొందరు క్రిటిక్స్ అంత గొప్పగా నటించలేదని విమర్శించినా మెజారిటీ జనాలకు జాన్వీ నచ్చింది.
అక్క హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే చెల్లెలు ఊరుకుంటుందా? నేను కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సై అంటోంది శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్.తాజాగా ఖుషీ కపూర్ ఓ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.అంతే ఖుషీ కపూర్ గ్లామర్ షోకి బాలీవుడ్ ఫిదా అవుతుంది. ఈ ఫోటో చూసిన వారందరు అక్కని మించిన అందం చెల్లెలుది అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఖుషీ కపూర్ని హీరోయిన్గా పరిచియం చేసే బాధ్యతను బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్కు అప్పగించినట్లుగా తెలుస్తుంది.అక్క ,చెల్లెలు బాలీవుడ్ను దున్నేదాం అనే కసితో కనిపిస్తున్నారు.