Tuesday, May 7, 2024
- Advertisement -

రిహార్సల్స్‌లో రచ్చ చేస్తున్న‌ కియారా అద్వాని

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌రిచిత‌మే. తెలుగులో మ‌హేశ్ బాబు న‌టించిన భ‌ర‌త్ అను నేను సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగో మ‌రో ఛాన్స్ వెంట‌నే కొట్టేసింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డంతో ఈ భామ‌కు తెలుగులో మరో అవ‌కాశం రాలేదు. బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాల్లో న‌టిస్తు ఫుల్ బిజీగా ఉంది. కియారా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి రీమేక్‌లో న‌టిస్తుంది. ఈ సినిమాలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. తాజాగా వీరిద్ద‌రు క‌లిసి ఓ పాట‌కు రిహార్సల్స్ చేశారు.

జీ వారు నిర్వహించే ఈవెంట్‌లో వరుణ్ – కియారాలు డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కోసం ఈ రిహార్సల్స్ చేస్తున్నారట. ఆ రిహార్సల్ వీడియోలనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది కియారా అద్వాని. నా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ పార్టనర్ వరుణ్ ధావన్ తో కలిసి జీ పెర్ఫార్మన్స్ కోసం రిహార్సల్ చేస్తున్నాం. అనే క్యాప్షన్ ఇచ్చింది. గ‌తంలో వీరిద్ద‌రి క‌లిసి ఊర్వశి ఊర్వశి’ పాట రీమిక్స్‌కు డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలో కూడా కియారా త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది. దీంతో కియారాలో మంచి డ్యాన్సర్ ఉన్నాడ‌ని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -