కియారా అద్వానీ… ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్గా మారిపోయింది. బాలీవుడ్లో ఆమె చేసిన ‘లస్ట్ స్టోరీస్ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతోనే కియారా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. లస్ట్ స్టోరీస్ సినిమాలో అమ్మడు ఫర్మామెన్స్కు బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఆమె తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ.
ఇక ఆమె రామ్ చరణ్తో నటించిన వినయ విధేయ రామ మాత్రం ప్లాప్గా నిలిచింది. అయినప్పటికి ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా కియారా ఓ క్యాలెండర్ ఫోటో షూట్ లో పాల్గొని అందాలను వయ్యారంగా రంగరించి మరీ కెమెరా కోసం కుమ్మరించింది. మమూలుగానే క్యాలెండర్ ఫోటో షూట్ అంటే రెచ్చిపోతారు. మరి అందాల నిధి ఉన్నట్లు ఉండే కియారా క్యాలెండర్కు ఫోటో షూట్ చేస్తుందంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా కియారా డబూ రత్నాని క్యాలెండర్ పై తన అందాల ప్రదర్శన చేసింది. ఇక ఫోటో ఎలా ఉంది అంటే ఒక లెదర్ కవర్ ఉన్న చెక్క పెట్టెపై వయ్యారంగా కూర్చుంది.
స్టోన్స్ ఎంబ్రాయిడరీ తో ఉన్న ఒక డెనిమ్ షర్ట్ ను తన అందాలకు అచ్ఛాదనగా మాత్రమే కప్పుకుంది. ఈ ఫోటోలో కియారా వీపు భాగం మొత్తం కనిపించేలా ఉంది.దీనితో పాటు తొడల అందంతో కుర్రకారుకి మత్తెక్కించేలా ఫోజిచ్చింది కియారా. మొత్తనికి కియారా అందాలను క్యాలెండర్లో చాలా ఒదిగ్గా చూపించారు. కియారా తన ఫోటోను అలా పోస్ట్ చేసిందో లేదో గంటలోపే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. కియారా ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. దీనితో పాటు తెలుగులో కూడా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
- Advertisement -
బోల్డ్గా రెచ్చిపోయిన కియారా అద్వానీ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -