కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్ పిసి524′.’రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరచమయ్యాడు కిరణ్ అబ్బవరం. తొలిసినిమాతోనే మంచి గుర్తింపు పొందారు. రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో మంచి సక్సెస్ అందుకున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న కిరణ్ తాజాగా సెబస్టియన్గా తెరపైకి రాబోతున్నాడు. మార్చి 4న ‘సెబాస్టియన్ పిసి 524’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లు.జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు.
బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్తో సెబాస్టియం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.