Saturday, May 18, 2024
- Advertisement -

జగన్ నిర్మాతగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి లక్ష్మీపార్వతి కామెంట్

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ రాజకీయ అంశంగా మారిపోయింది. టీడీపీ పార్టీలో ముగిసిన అంతర్గత వివదాలకు సంబంధించిన అనేక అంశాలు ఈ సినిమాతో ముడుపడి ఉన్నాయ్. రామ్ గోపల్ వర్మ కూడా అదే పాయింట్ ను టచ్ చేయబోతున్నారు. వర్మ ఈ సినిమాని కనుక కంప్లీట్ చేస్తే.. టీడీపీ పార్టీకి కొంత ఇబ్బందులు ఎదురైనట్లే.

దీనితో ఈ సినిమాలో ప్రతిపక్షన్ వైసీపీ పార్టీ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ గా ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నేత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రోజా కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ని చివరి రోజుల్లో ఇబ్బందులకు గురి చేసిన రాజకీయ అంశాలు, కుటుంబ అంశాలకు, ఆయనను లక్ష్మీ పార్వతికి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యాన్ని వర్మ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి జగన్ రహస్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వెలువడటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో టివి 9 ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

జగన్ నిర్మాతగా వ్యవహరించలేరని.. ఆయన దగ్గర డబ్బు లేదని అన్నారు. ఒక వేక డబ్బు ఉన్నా.. ఆయన అంత ఖర్చు చేయరని తెలిపారు. జగన్ డబ్బు ఖర్చు చేసే వ్యక్తే అయితే ఈపాటికే ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలువకపోవడానికి కారణం డబ్బు ఖర్చు చేయకపోవడమే అని ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది. ఎన్టీఆర్ చివరిరోజుల్లో పడ్డ మనోవేదనని వక్రీకరించకుండా చూపిస్తే ఈ సినిమాకి తన మద్దతు ఉంటుందని ఆమె అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -