మహానటి సినిమా తో నేషనల్ అవార్డు సాధించిన నటి కీర్తి సురేష్. ఈ సినిమా తో నటి గా కీర్తి సురేష్ ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా కీర్తి కి ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కీర్తి తెలుగు లో మరియు తమిళం లో వరుస సినిమాల తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హిందీ లో కూడా ఒక సినిమా షూటింగ్ చేస్తున్న కీర్తి ఒక కొత్త చిత్రాన్ని సైన్ చేసిందని టాక్.
ఈశ్వర్ కార్తీక్ అనే ఒక కొత్త దర్శకుడి తో కీర్తి ఈ సినిమా చేయనుంది అనే టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా ఒక థ్రిల్లర్ అని, ఈ సినిమా లో కీర్తి సురేష్ పోషిస్తున్న పాత్ర అందరినీ ఎంతగానో అలరించేలాగా ఉంటుంది అని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా స్పెషల్ ఏంటి అంటే, ఇప్పటి వరకు తన కెరీర్ లో అందుకోనంత పారితోషికం కీర్తి ఈ సినిమా తో అందుకోనుందట. అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ అని ఫిలిం ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.
ఈ సినిమా ని తెలుగు లో కూడా ప్రేక్షకుల కోసం తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.