- Advertisement -
శ్రీమంతుడు ప్రచార కార్యక్రమాలు ముగించుకొని థాయిలాండ్లో సేద తీరుతున్న ప్రిన్స్ మహేశ్ బాబు ఉన్నట్లుండి, తిరుగు ప్రయాణం అయ్యాడు.
కుటుంబానికి సంబందించిన ఒక వార్త మహేశ్ తిరుగు ప్రయాణానికి కారణమైంది. బావ గల్లా జయదేవ్ బైక్ మీద నుంచి పడి గాయాల పాలవ్వడంతో, మహేశ్ బాబు తన విహారయాత్రను రద్దు చేసుకున్నాడు.
తక్షణం హైదరాబాద్ వచ్చేస్తున్నారని సమాచారం. సోమవారం సాయంత్రం ఎంపి గల్లా జయదేవ్ బైక్ మీద నుంచి పడి గాయలయ్యాయని తెలిసింది. ఆయన ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ కూడా స్పందిస్తూ, తిరుగు ప్రయాణం అయ్యాడు..