నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ చేస్తున్నాడు.బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటికి వచ్చింది.ఎన్టీఆర్ జీవిత కథ అంటే ఖచ్చితంగా రాజకీయలకు సంబంధించిన విషయాలు ఉండాలి.దీనిలో భాగంగానే మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు పాత్రలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో మండలి కృష్ణారావు తన పదవి రాజీనామా చేసి మరీ ప్రజలకు సేవలు చేశారు. ఈ క్రమంలో అతడి పాత్రను ఆయన కొడుకు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ పోషిస్తే బాగుంటుందని దర్శకుడు క్రిష్, బాలకృష్ణలు ఆయన్ని కోరినట్లు తెలుస్తోంది.ఇక ఎన్టీఆర్ బయోపిక్ను రెండు భాగాలుగా విడుదల చేయలని చూస్తున్నాడు చిత్ర దర్శకుడు క్రిష్ దీనిలో భాగంగానే ఈ రోజు సినిమాలోని ఓ పోస్టర్ను విడుదల చేశారు.ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమాలోని మొదటి భాగాన్ని జనవరి 9న విడుదల చేయనున్నారు.