గీత రచయిత వైరముత్తుపై కొందరు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చిన్మయి ట్వీటర్ ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. చిన్మయి శనివారం చెన్నై పత్రికా సంఘం కార్యాలయంలో తమిళనాడు సినీ పరిశ్రమ పరిరక్షణ సమాఖ్య తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. చిన్మయి మాట్లాడుతు ..లైంగిక వేధింపుల గురించి 2013లో నేను ట్వీటర్లో పేర్కొన్నప్పుడు బెదిరింపులు వచ్చాయి.
ఇప్పుడు కూడా నాపై యాసిడ్ పోస్తామంటూ హత్యా బెదిరింపులు వస్తున్నాయి. అదే విధంగా గత వారం రోజులుగా ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనను అప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు చెబుతున్నావని ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించి ఉండవచ్చు. అయితే మహిళల గొంతులు నొక్కే ప్రయత్నాలు కూడా ఆదే స్థాయిలో జరుగుతున్నాయి. వైరముత్తుపై కేసు వేస్తాను. అందుకు ఆధారాలను రెడీ చేసుకుంటునని తెలిపింది చిన్మయి.