నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నాడనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. అయితే తాజాగా తన కొత్త సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశాడు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన గ్రాఫిక్స్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయింది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కానుంది.
ఇక ఈ సినిమాను ఆగస్టు 17వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. సినిమాలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.ఇక ఈ సినిమాలో భూమిక ఓ ముఖ్యమైన రోల్లో కనిపించనుంది. నాగచైతన్య మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ రెండు సినిమాలలో ఏది మొదట విడుదల అవుతుందా అని ఇన్నాళ్లు నాగచైతన్య ఫ్యాన్స్ ఎదురు చూశారు. మొత్తనికి సవ్యసాచిని మొదట విడుదల చేస్తున్నారు.