దర్శకుడు పూరి జగన్నాథ్ హీరో నాగర్జనతో సినిమా చేసి 13 సంవత్సరాలు అయింది. మళ్లీ ఇన్నాళ్లుకు నాగ్తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.గతంలో నాగ్తో పూరి సూపర్,శివమణి సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి.కాని పూరికి గతంలో ఉన్న సక్సెస్ ఇప్పుడు లేదు. తన కొడుకుని హీరోగా పరిచియం చేసి మెహబూబా సినిమా తీశాడు పూరి.సినిమా ఫెయిల్ కావడంతో పూరితో పనిచేయడానికి స్టార్ హీరోలు ఎవరు ఆసక్తి చూపించడం లేదు.
దీంతో తన దగ్గర ఉన్న కథతో నాగ్ను కలిశాడని, కథ నాగర్జునకు నచ్చడంతో సినిమా పట్టాలు ఎక్కుబోతుందని తెలుస్తుంది. అయితే ఈ కథ గతంలో మహేష్ బాబుకి చెప్పిన జన గణ మణ స్టోరీనే కొద్దిగా మార్పులు చేసి హీరో నాగర్జునకు చెప్పాడని సమాచారం.సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తుంది.