Friday, April 26, 2024
- Advertisement -

నానికి కి ఎదురెళ్లనున్న కార్తికేయ

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాట లేకపోతున్నాడు. ఈ మధ్యనే కార్తికేయ హీరోగా విడుదలైన ‘హిప్పీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సినిమాకి కనీసం మంచి ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో నిర్మాతలు కూడా భారీ గా నష్టపోయారు. అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడంతో నిర్మాతలు కూడా నష్టాలపాలయ్యారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చిన క్రేజ్ ఎలా ఉన్నప్పటికీ ‘హిప్పీ’ సినిమాతో మాత్రం కార్తికేయ మార్కెట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం కార్తికేయ బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘గుణ 369’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ సినిమాకి కూడా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా బాగానే జరుగుతుందని ఆశించారు. కానీ ‘హిప్పీ’ సినిమా ఎఫెక్ట్ ‘గుణ 369’ సినిమాపై భారీగా పడిందని తెలుస్తోంది. ‘గుణ 369’ సినిమా కొనడానికి బయ్యర్లు ముందుకు రావటంలేదు. పైగా ఈ సినిమాని ఆగస్ట్ 31న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కానీ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. నాని సినిమా తో పోటీపడి హిట్ తెచ్చుకోడం అంటే అంత సులువైన విషయం కాదు. అందుకే బయ్యర్లు సినిమా కోసం ముందుకు రావడం లేదు. కానీ మరోవైపు దర్శక నిర్మాతలు మాత్రం సినిమాను ఎలాగోలా ఏదో ఒక రేటు కు అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -