Monday, April 29, 2024
- Advertisement -

“ఆదిపురుష్ ” పై దారుణంగా ట్రోల్స్.. అయిన రికార్డుల మోత !

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ” ఆదిపురుష్ “. ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండేళ్లుగా ఈ మూవీ నుంచి ఎలాంటి పోస్టర్ గాని టీజర్ గాని రిలీజ్ కాకపోవడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం డార్లింగ్ అభిమానులు కళ్ళు కాయలు కచేలా ఎదురుచూశారు. రాముడి రూపంలో తమ అభిమాన హీరో ఎలా ఉంటాడో అని, ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం, టీజర్ కోసం అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ అక్టోబర్ 2 న టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే టీజర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రభాస్ లుక్ ఆర్టిఫిషియల్ గా ఉండడం, మూవీలో గ్రాఫిక్స్ యానిమేటెడ్ మూవీలా ఉండడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రభాస్ లాంటి హీరోను దర్శకుడు ఓం రౌత్ ఒక కార్టూన్ లా చూపించడాని, అభిమానులు మండిపడుతున్నారు. టీజర్ లో చూపించిన వి‌ఎఫ్‌ఎక్స్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ” ఆది పురుష్ ” మూవీని రజినీకాంత్ ” కొచ్చాడయన్ ” మూవీతో పొలుస్తూ మండిపడుతున్నారు ప్రభాస్ అభిమానులు. ఇదిలా ఉండగా మరోవైపు ” ఆది పురుష్ ” టీజర్ రికార్డ్స్ తిరగరాస్తోంది. టీజర్ రిలీజ్ అయిన 15 గంటల్లోనే 50 మిలియన్ల వ్యూస్ కు పైగా సంపాదించి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు fastest50millionsviews పేరున ఉన్న కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 రికార్డులను ” ఆది పురుష్ ” అదిగమించి నయా రికార్డులను సెట్ చేసింది. .ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానింది. మరి నెగిటివ్ వైబ్స్ తోనే రికార్డులు తిరగరాస్తోన్న ” ఆది పురుష్ ” .. విడుదల తరువాత ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -