ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచియమైంది హీరోయిన్ రష్మిక .తొలి సినిమాతోనే గ్రాండ్ విక్టరీ కొట్టిన రష్మికకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి.ఇటీవలే విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం సినిమా 100 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది.ఈ సినిమాలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.గీతా గోవిందం సినిమాతో తెలుగులో చాలామంది అభిమానులను సంపాధించుకుంది రష్మిక.తాజాగా మరో క్రేజీ కాంబినేషన్లో చాన్స్ కొట్టేసింది ఈ భామ.
దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ హీరోగా భీష్మా అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకున్నారని తెలుస్తుంది.రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడు.సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.