- Advertisement -
వరుస ఫ్లాప్లో ఉన్న హీరో నితిన్ ఈసారి రాబిన్ హుడ్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్తో భీష్మ సినిమాను తెరకెక్కించిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
తొలుత ఈ సినిమాలో రష్మికని హీరోయిన్గా ప్రకటించినా చివరకు వెరే హీరోయిన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇక ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు మేకర్స్. వరుస ఫ్లాప్స్ తో ఉన్న నితిన్కు రాబిన్ హుడ్ అయినా సక్సెస్ని అందిస్తుందో లేదో వేచిచూడాలి.