వరుస ఫ్లాప్లతో ఉన్న హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నితిన్తో భీష్మ సినిమాను తెరకెక్కించిన వెంకీ కుడముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తొలుత రష్మికా మందన్నను హీరోయిన్గా ఎంపిక చేయగా తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.
రష్మికా స్థానంలో రాశీ ఖన్నాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీలీల పేరును కూడా పరిశీలించిన చివరకు రాశీ పేరును ఫైనల్ చేశారు. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రాశీ ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డతో మూవీ చేస్తుండగా తాజాగా రాబిన్ హుడ్లో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. జివి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నితిన్కు భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ…రాబిన్ హుడ్తో మళ్లీ సక్సెస్ రుచి చూపిస్తారా వేచిచూడాల్సిందే.