భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ లోగా ఈ నెల 15వ తేదీన ఫస్టు టీజర్ ను విడుదల చేయాలనుకున్నారు.
తాజాగా టీజర్ ను రిలీజ్ చేసే సమయాన్ని ఫిక్స్ చేశారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా .. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా త్రివిక్రమ్ ఈ టీజర్ ను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.
ఈ పోస్టర్లో.. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఎన్టీఆర్ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, జగపతిబాబు .. నాగబాబు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.