తెలుగుదనానికి, దర్పానికి ప్రతిరూపం స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలుస్తారు. ఈ విషయాన్ని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కన్నారు. ‘ఎన్టీఆర్’ సినిమాను హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్లో గురువారం (మార్చి 29) అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభ వేడుకకు హాజరైన వెంకయ్య బాలకృష్ణపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గెటప్లో అదరహో అనిపించాడు.
ఎన్టీఆర్ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారని వెంకయ్య అభినందనించారు. ఎన్టీఆర్ జీవితాన్ని నవతరానికి అందించే ప్రయత్నం చేయడం సంతోషమ, సినిమా విజయవం పొందాలని ఆకాంక్షించారు. తేజ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రల్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ బ్యానర్ను బాలకృష్ణ ప్రారంభించి ఈ సంస్థ నిర్మాణంలో సినిమా రూపుదిద్దుకుంటోంది. సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటీనటుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది.
షూటింగ్ ప్రారంభోత్సవానికి దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, నిర్మాత సి.కల్యాణ్, సీనియర్ ఎన్టీఆర్ మనవడు, హీరో కల్యాణ్ రామ్ తదితరులు వచ్చాడు.
తొలిరోజు షూటింగ్లో బాలకృష్ణ దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించిన దానవీర శూర కర్ణ సినిమాలోని ‘రాచరికమా అర్హతలు నిర్ణయించునది’ అనే డైలాగ్లను తొలి షాట్గా తీశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాఉ. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని సినిమా బృందం ప్లాన్.